రాయల్ సోల్డియర్స్ ఆధ్వర్యంలో అనాధాశ్రమంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

గుంటూరు, ప్రార్థించే పెదవులతో పాటు సాయం చేసే చేతులు కూడా కావాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కి నిజమైన నివాళి ఆయన ఆశయాలకు అనుగుణంగా ముందుకువెళుతూ సామాజిక సేవ చెయ్యటమే అని నమ్మి గురువారం వారి జయంతి సందర్భంగా జేఎస్పి రాయల్ సోల్డియర్స్ అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు అనాధ బాలబాలికలకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనాధశ్రమ నిర్వాహకులకు 25 కేజీల బియ్యం అందించి, అనాధాశ్రంలో ఉన్న బాలబాలికల మధ్య కేకు కట్ చేయించటం జరిగింది. ఈ కార్యక్రమాలను గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ల హరి, కార్పొరేటర్ శ్రీమతి యర్రంశెట్టి పద్మావతి, పార్టీ నాయకులు శ్రీమతి పాకనాటి రమాదేవి, యర్రంశెట్టి సూరి, రెల్లి సంఘ రాష్ట్ర, జిల్లా నాయకులు సోమి శంకరరావు, సోమి ఉదయ్ కుమార్, నగర పార్టీ నాయకులు శిఖా బాలు, ఉరుబండి లెనిన్, తోట వెంకటేష్, ఆకుల సాయి, ముత్తిరెడ్డి సతీష్, శిరిగిరి నవీన్ తదితరుల చేతుల మీదుగా నిర్వహించటం జరిగింది.