విజయనగరం జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

విజయనగరం, గురువారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకుని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాగాయకులు, దళిత ఐక్య వేదిక అధ్యక్షుడు, ఆదాడ మోహనరావు నేతృత్వంలో స్థానిక అంబేద్కర్ కూడలిలో(బాలజీ జంక్షన్) ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జనసేన పార్టీ నాయకులు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు ఆదాడ మోహనరావు మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన వర్గాల హక్కులు కోసం, అభ్యున్నతి కోసం పోరాడిన యోధుడు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ అని ఇటువంటి మహనీయున్ని ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా తీసుకున్నందుకు భారతీయులు గా మనమంతా గర్వించదగ్గ విషయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), రౌతు సతీష్, వంక నరసింగరావు, పిడుగు సతీష్, యర్నాగుల చక్రవర్తి, దంతులూరి రామచంద్ర రాజు, మోపాడ అనిల్, డోల రాజేంద్రప్రసాద్, బూర్లి వాసు, సిగ తవిటి నాయుడు, దన్న ఏషు, పళ్లెం కుమారస్వామి, అడబాల వెంకటేష్, అనిల్, పాల్గొన్నారు.