అంబేద్కర్ సేవలు అభినందనీయం: ఉప్పు వెంకట రత్తయ్య

పెదనందిపాడు మండలంలోని వరగాని గ్రామంలో గురువారం బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు జనసేన పార్టి ఆధ్వర్యంలో ఘనంగా జరిగినాయి . జనసేన పార్టి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకట రత్తయ్య అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించినారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ న్యాయ శాఖ తోలి మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎంతో అభినందనీయం అని వెంకటరత్తయ్య అన్నారు. సమాజంలో అట్టడుగున వున్నటువంటి పేద బడుగు బలహిన గిరిజన వర్గాల ప్రజల అభ్యున్నతికి నిరంతరం శ్రమించిన త్యాగజీవి అంబేద్కర్ గారని అన్నారు. అంబేద్కర్ భావాలను నేటితరం ప్రజలందరికీ తేలియజేయాల్సిన అవసరం వుందని వెంకట రత్తయ్య అన్నారు. పెదనందిపాడు మండల అధ్యక్షులు కోల్లా లీలా వెంకట గోపినాధ్ మాట్లాడుతూ రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సముచిత స్థానం కల్పించి అందరి ఆదరాభిమానాలు చూరగోన్నారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో ఓబ్బినేని శ్రీనివాసరావు, వరగాని గ్రామ ప్రెసిడెంట్ నూనె శివయ్య, గ్రామ ప్రధాన కార్యదర్శి డేచేబ్రోలు నారాయణస్వామి, గ్రామ కార్యదర్శి నూనె శ్రీనివాసరావు ( గండి ), చీరాల శ్రీనివాసరావు, నూనె వెంకటేశ్వర్లు, మంగనెల్లూరు వాసు, తదితరులు చూరగోన్నారని అన్నారు.