మత్స్యకార అభ్యున్నతి యాత్రకు సిద్దం కావాలని పిలుపునిచ్చిన అనపర్తి జనసేన

అనపర్తి, పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో శ్రీసీతారామ భాస్కరరామరావు కళ్యాణమండపంలో ఇంచార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. నూతనంగా నియమించిన మండల కమీటీల అభినందన మరియు పరిచయ కార్యక్రమం తదుపరి ప్రియతమ నాయకులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేది నుండి పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సారధ్యంలో జిల్లాలో ప్రారంభం కానున్న మత్స్యకార అభ్యున్నతి యాత్ర మరియు 20వ తేదిన అధినేత నరసాపురంలో జరుగు మత్స్యకార అభ్యున్నతి సభ పాల్గొననున్న నేపధ్యంలో జనసేన శ్రేణులు సిద్దంకావలాని పిలుపునిచ్చారు. మండల కమీటీల సభ్యులు సమర్థవంతంగా పనిచేసి పార్టీ బలోపేతం చేయాలని అన్నారు. త్వరలో గ్రామ కమీటీల నియామకం కూడా పూర్తి చేయాలని అన్నారు. పెద్దాడ గ్రామంలో స్వర్గస్తులైన జనసైనికుడు వెలగ శేఖర్ కుటుంబ సభ్యులకు పదివేలు ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్.నాగు, పెదపూడి మండల ప్రెసిడెంట్ నాగిరెడ్డి వీరాస్వామి, బిక్కవోలు మండల ప్రెసిడెంట్ ఇందాల వీరబాబు, అనపర్తి మండల ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, రంగంపేట మండల ప్రెసిడెంట్ గిరిజాల సత్తిబాబు, చిట్టి బ్రహ్మం, అడబాల విష్ణు, పాటంశెట్టి కాశీరాణి, యడ్లపల్లి వీరసాయికృష్ణ, సుంకర బుజ్జి, సీతారామ్, కోసూరి విజయ మరియు నియోజకవర్గంలోని నాలుగు మండలాలలోని జనసేన శ్రేణులంత పాల్గొన్నారు.