వేలేరుపాడు మండల కమిటి నియామక కార్యక్రమం

పోలవరం నియోజకవర్గం, వేలేరుపాడు మండలం, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు అదేశానుసారం జిల్లా నాయకులు కరాటము సాయి, గడ్డమనుగు రవి మరియు పోలవరం జనసేన ఇంఛార్జి చిర్రి బాలరాజు ల సలహాలు సూచనలు తీసుకొని మండల మరియు గ్రామ కమిటీలు ఏర్పాటు చేయడానికి బుధవారం వేలేరుపాడు మండల జనసేన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశములో అందరూ చర్చించిన మీదట ఏకాభిప్రాయంకి వచ్చి రేపటి నుండి గ్రామాల్లో అందరూ తిరిగి కమిటీలు వేయాలని నిర్ణయంచారు. కమిటీలు పూర్తి అయిన తర్వాత ఒకరోజు నియోజకవర్గ నాయకులను పిలిపించి సభ నిర్వహించి వారి సమక్షంలో సభలో ఆమోదం పొందాలని నిర్ణయించామని వేలేరుపాడు మండల అద్యక్షులు గణేశుల ఆదినారాయణ తెలిపారు.