ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 12వ రోజు

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కావలి హరిజన వాడలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా స్థానికులు గ్రామంలోని కొన్ని సమస్యలు జనసేన పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా గ్రామానికి సమీపంగా ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ కారణంగా వాయు కాలుష్యం అధికంగా ఉండడం వల్ల అనేక రోగాలకు గురి అవుతున్నాము, గ్రామాన్నీ తరలిస్తామని చెప్పి ఇప్పటివరకు దాని ఊసే లేదు, ప్యాకేజి ఇస్తామని హామీ ఇచ్చి మొండి చేయి చూపించారు. అధికారులు దయ చూపి మాకు ప్యాకేజి మంజూరు చేయాలని,జనసేన వాళ్ళు ఈ ప్యాకేజీ విషయంలో మాకు మద్దతుగా నిలవాలని గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ మీ హక్కుల కోసం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతామని జనసేన నాయకులు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలూరు పెంచల నరసింహా, తాండ్ర శ్రీను, కావలి పవన్ కుమార్, తుంగా సునీల్, లిఖిత్ తదితరులు పాల్గొన్నారు.