ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం

పిఠాపురం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో, జిల్లా జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతులపై ప్రారంభోత్సవం చేయబడి పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు ఏర్పాటుచేస్తున్న శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు ప్రతి శనివారం పిఠాపురం పశువుల సంత వద్ద రైతులకుఅన్నపానీయ సదుపాయమును కల్పించుచున్నారు. 32వ వారం కూడా శనివారం 800 మంది రైతులకు, పశువుల బేరాల మధ్యవర్తులకు, వివిధ హాస్పటల్ కి వచ్చి ఔట్ పేషెంట్లకు కలిపి అన్నపానీయం సదుపాయమును కల్పించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రం నందు రైతులకు, పశువుల అమ్మక మద్యవర్తులకు, హాస్పటల్ ఔట్ పేషెంట్ లకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నగర జనసేన నాయకులు అల్లంకిషోర్, జ్యోతుల సీతరాంబాబు, నక్కామణికంఠ, బొత్స శ్రీకాంత్, ఎద్దురాజు, జ్యొతుల నాని, పోట్టినురి గణేష్, విప్పర్తి శ్రీను తదితరులు ఆహరపానీయ వడ్డనలో తమ సేవలను అందించారు. శ్రీమతి డోక్కా సీతమ్మ అన్నపానీయ సదుపాయ కేంద్రమునకు శ్రమశక్తి ద్వారా సేవలందిస్తున్నారని వారికి నా ప్రత్యేకమైన దన్యవాదాలను తెలియజేయుచున్నానని జ్యోతుల శ్రీనివాసు ఒక ప్రకటనలో తెలియజేశారు.