వరలక్ష్మి కుటుంబంపై వైఎస్సార్సీపీ తీరును ఖండించిన వబ్బిన శ్రీకాంత్

  • మీకు ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే పెందుర్తి నియోజకవర్గం లో ఉన్న వాలంటీర్ల యొక్క పోలీసు వెరిఫికేషన్ సర్టిఫికెట్లు చూపించాలి

పెందుర్తి నియోజకవర్గం: వాలంటీర్ వెంకటేష్ చేతిలో మరణించిన వరలక్ష్మి కుటుంబంపై వైఎస్ఆర్సిపి ప్రవర్తనను పెందుర్తి జనసేన నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ తీవ్రంగా ఖండించారు. సోమవారం శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్ వెంకటేష్ చేతిలో మరణించిన కీ||శే వరలక్ష్మీ కుటుంబాన్ని పరామర్శించి ,బరోసా ఇచ్చిన తర్వాత వారి కుటుంబపై స్థానిక వైఎస్ఆర్సిపి నాయకుల ప్రవర్తన తీవ్రంగా ఖండిస్తూ.. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న వాలంటీర్లు అందరి యొక్క పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికెట్లని చూపించాలని, మీరు ఎటువంటి వెరిఫికేషన్ చేయకుండా వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఈరోజు వరలక్ష్మి గారు చనిపోవడానికి పరోక్షంగా బాధ్యులు అయ్యారని, ఇప్పటివరకు స్థానిక కార్పొరేటర్ గానీ, స్థానిక ఎమ్మెల్యే ఆ కుటుంబాన్ని పరామర్శించకుండా మీ యొక్క కార్యకర్తలతో మీ యొక్క సొంత ఛానల్ లో వెంకటేష్ అనే వ్యక్తి ఆ క్లస్టర్ తాలూకా వాలంటీర్ కాదు అని, వేరే క్లస్టర్ కు సంబంధించిన వ్యక్తి అని చెప్పడం చాలా దారుణమని, పోలీస్ స్టేషన్ లో క్రైమ్ రికార్డులు ఉన్న వ్యక్తికి మీరు ఒక వాలంటీర్ ఉద్యోగం ఇవ్వడం ఆ వ్యక్తి సమాజంలో తిరగడం వల్ల ఈరోజు వరలక్ష్మి గారిని ఆ కుటుంబం కోల్పోవడం జరిగిందని, మీకు దమ్ము ధైర్యం చిత్తసిద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన విషయాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలి, ప్రజలు కూడా చైతన్యవంతులై ఎవరైనా మీకు సంఘవిద్రోహులుగా కనిపిస్తే కళ్యాణ్ గారు చెప్పినట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో గాని, జనసేన పార్టీ నాయకులు గాని మీ గ్రామంలో ఉన్న పెద్దలకి తెలియజేయాలని కోరడం జరిగింది.