అంగన్వాడీ కార్యకర్తల డిమాండ్లు నెరవేర్చాలి: పితాని

ముమ్మిడివరం: రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడి టీచర్స్, వర్కర్స్, హెల్పర్స్, నిరవధిక సమ్మె మొదలుపెట్టారు. గురువారం జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ముమ్మిడివరం మండలం, ముమ్మిడివరం ఎండిఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్న అంగన్వాడీ నిరవధిక సమ్మెలో కూర్చుని వారికి మద్దతు ప్రకటించారు. అంగన్వాడీ కార్యకర్తలు వారి యొక్క సమస్యలను పితాని బాలకృష్ణ దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పితాని బాలకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీ కార్యకర్తల యొక్క డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. మా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు అన్నివిధాలా ఆదుకుంటాం అని జనసేన పార్టీ తరపున పితాని బాలకృష్ణ వారికి హామీ ఇచ్చారు. వీరివెంట తాళ్లరేవు మండల అధ్యక్షులు అత్తిలి బాబురావు, ఐ పోలవరం మండల అధ్యక్షులు మద్దింశెట్టి పురుషోత్తం, కాట్రేనికోన మండల అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, బద్రి రమా, దూడల స్వామి, సుంకర రామచంద్ర రావు సానబోయిన వీరభద్రరావు, పెన్నాడ శివ, గాలిదేవర బుల్లి, జక్కంపూడి కిరణ్, మాదాల శ్రీధర్, సుందరంపల్లి సత్యనారాయణ, పెమ్మిరెడ్డి సత్యనారాయణ మూర్తి, వంగా సీతారాం, అన్నంనీడి గురువులు, గాలిదేవర రాము, పెమ్మాడి శ్రీను, ఓలేటి శ్రీను,వనచర్ల బాలకృష్ణ, బొక్క శ్రీను, బొంతు సత్తిబాబు, కొప్పిశెట్టి నాని, మొదలగు వారు పాల్గొన్నారు.