అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్: గత ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెలో భాగంగా ఎల్కతుర్తి మండల కేంద్రం తహశీల్దారు కార్యాలయం వద్ద ఉద్యోగులు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయపరమైన 28డిమాండ్లను పరిష్కరించాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ మరియు నాయకులు వినోద్, విజయ్, జయక్రిష్ణ, అజయ్, సాంబరాజు తదితరులు పాల్గొన్నారు.