జనసైనికుని కుటుంబానికి అండగా తుని జనసేన

  • అంకారెడ్డి రాజాశేషు 5000/- రూపాయల ఆర్ధికసాయం

తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం, కె.ఓ. అగ్రహారం జనసైనికుడు ఉప్పల రాము అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన కారణంగా, తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజాశేషు 5000 రూపాయలు ఆర్ధికసాయం, 25 కేజీల బియ్యం అందించి భవిష్యత్తులో ఎటువంటి సమస్య వచ్చినా భరోసాగా మీకు జనసేన కుటుంబం ఉంది అని చెప్పడం జరిగింది.

  • తుని జనసైనికులు 20,000/- ఆర్ధికసాయం

తుని నియోజకవర్గం, కోటనందూరు మండలం, కె.ఓ. అగ్రహారం జనసైనికుడు ఉప్పల రాము అకాల మరణం చెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడిన కారణంగా, తుని నియోజకవర్గ జనసైనికులు అందరూ ఫండ్ రైజింగ్ చేసి, 20000/- రూపాయలు 25 కేజీల బియ్యం అందించి ఆ కుటుంబానికి భరోసాగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో కోటనందూరు మండల అధ్యక్షులు పెదపాత్రుని శ్రీనివాస్, తుని నియోజకవర్గ జనసేన నాయకులు అంకారెడ్డి రాజా శేషు, మండల నాయకులు పేనుముచ్చు ప్రవీణ్, కోట సందీప్, అల్లు రాజుబాబు, వాసం రాము, శ్రీకర్, గాడి జమీలు, మరువాడ శివ తదితర జనసైనికులు పాల్గొన్నారు.