బోర్డ్ మీటింగ్ ను నిర్వహించిన “అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్”

🔸జులై నెలలో చేయబోయే కార్యక్రమాల పై చర్చ
🔸బోర్డ్ మీటింగ్ లో హాజరైన కమిటీ సభ్యుల నిర్ణయం

విజయనగరం, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం, బాలాజీ జంక్షన్ వద్దనున్న అంబేద్కర్ సామాజిక భవనంలో కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం గూర్చి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ జులై నెలలో చేయబోయే కార్యక్రమాలపై కొన్ని తీర్మానాలు చేసామని, ముఖ్యంగా జులై ఒకటివ తేదీన వైద్యుల దినోత్సవాన్ని, జులై పదమూడవ తేదీన వాకర్స్ ఉద్యమకారులు తోషినివాలా వారి జయంతి సందర్బంగా మరియు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎన్.వి సుబ్బారెడ్డి విజయనగరం సందర్శన ఉన్న సందర్బంగా, డిస్ట్రిక్ట్-102 గవర్నర్ పి. జి గుప్తా పిలుపు మేరకు నడకపోటీలను నిర్వహిస్తున్నామని, ఇవియే కాక వివిధ సేవా కార్యక్రమాలు చేయడానికి బోర్డు సభ్యులంతా నిర్ణయించారని తెలిపారు. క్లబ్ అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ డాక్టర్ ఎస్. మురళి మోహన్, లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు, క్లబ్ సభ్యులు ముక్కి కుమార్, చందక రాజారాయ్, పొట్నూరు ఆనంద్ పాల్గొన్నారు.