జనసేన ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” కార్యక్రమం

విశాఖ, ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ “ఆహార నిధి” కార్యక్రమం జనసేన దక్షిణ నియోజకవర్గ నాయకులు గోపికృష్ణ (GK) ఆధ్వర్యంలో KGH OP గేట్ నందు శనివారం మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ పవన్ కళ్యాణ్ వీరాభిమాని, జనసేన కార్యకర్త అయిన శ్రీ నీలం రాజు(మచ్చ రాజు) చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం GK ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తుండగా ఫౌండేషన్ సభ్యులు, ముఖ్య అతిథులుగా GVMC ఫ్లోర్ లీడర్ శ్రీమతి భీశెట్టి వసంత లక్ష్మి, జనసేన జిల్లా నాయకులు శ్రీ పి.శివ ప్రసాద్ రెడ్డి, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.