బలమైన జనసేనే లక్ష్యం: సుంకర అప్పారావు

  • శృంగవరపుకోట జనసైనికుల ఆత్మీయ సమావేశం

ఎస్.కోట నియోజకవర్గం: శృంగవరపుకోట మండలంలో బలమైన శక్తిగా జనసేన పార్టీని తీర్చిదిద్దడమే తన ముందున్న లక్ష్యమని ఎస్.కోట నియోజకవర్గం వేపాడ మండలాధ్యక్షుడు సుంకర అప్పారావు పేర్కొన్నారు. మండలంలోని ఆకుల సీతంపేట గ్రామంలో ఆదివారం జనసైనికుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా ఆకుల సీతంపేట చేరుకున్నారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గం ఎగ్జిక్యూటివ్ సభ్యుడు జొన్నపల్లి సత్తిబాబు అధ్యక్షతన ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుంకర అప్పారావు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వహిస్తానని అన్నారు. సామాన్యులకు అండగా, సమస్యల పరిష్కారంపై జనసేన అలుపెరగని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. మండల రైతులను సాగునీటి సమస్య చిరకాలం వేదిస్తున్నా ఎవరికీ పట్టడంలేదన్నారు. సాగునీటి వనరుల కల్పన కోసం యంత్రాంగంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. పార్టీ బలోపేతానికి జనసైనికులంతా సంఘటితంగా తోడ్పాటు అందించాలని కోరారు. జనసేన పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందన్నారు. అందుకే సామాన్యులకూ పదవులు వరించాయని తెలిపారు. పనిచేసేవారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కొత్తవలస మండలాధ్యక్షుడు నక్కరాజు సతీష్, ఎస్.కోట మండలాధ్యక్షుడు కొట్యాడ రామకోటి, వీరమహిళలు అడపా కళ్యాణి, సగ్గుబిండి వెంకటలక్ష్మి, యిర్ర వెంకటలక్ష్మి, నాయకులు రామెళ్ల శివాజీ, కోల మధు, రుద్ర నాయుడు, అలమండ రాంబాబు, రావాడ నాయుడు, మల్లువలస శ్రీను పిరోజ్, రెహ్మాన్, తాండ్రంగి చంటి, చిన్ని, సతీష్, గాలి అప్పారావు, రామదుర్గ, జనసైనికులు పాల్గొన్నారు.