సర్ అర్ధర్ కాటన్ జయంతి

కోనసీమ జిల్లా, సర్ అర్ధర్ కాటన్ జయంతి సందర్భంగా పొదలాడ సెంటర్లో జనసేన నాయకులు కాటన్ దొర విగ్రహనికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. సర్ అర్థర్ కాటన్ బ్రిటిష్ పాలనలో భారత దేశంలో నీటి పారుదల, నావికా యోగ్యమైన కాలువలు కట్టించారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరంలో అనకట్ట నిర్మించి లక్షలాది ఎకరాలుకు గోదావరి జలాలు అందేలా కృషి చేసిన చిరస్మరనీయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్, యెరుబండి రామకృష్ణ, జనసైనికులు పాల్గొన్నారు.