చేజర్ల తండాలో మండల స్థాయి కబడ్డి పోటీలు

  • మొదటి బహుమతికి స్పాన్సర్ చేసిన సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు మండలం, చేజర్ల తండాలో సంక్రాంతి సందర్భంగా మండల స్థాయి కబడ్డి పోటీలు నిర్వహించగా 15 టీంలు పోటీలో పాల్గొనగా చల్లగుల్ల గ్రామానికి చెందిన ప్రసన్నాంజనేయం టీం ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్నది. మొదటి బహుమతి సత్తెనపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు స్పాన్సర్షిప్ చేశారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండల అధ్యక్షులు తాడువాయి లక్ష్మీ శ్రీనివాస్ చేతుల మీదుగా మొదటి బహుమతి ఇవ్వడం జరిగింది.