పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: ఖాసీం సైదా

గురజాల నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎలక్షన్ లో టీడీపీతో కలిసి వెళ్తామని చేసిన వ్యాఖ్యలను జిల్లా జాయింట్ సెక్రటరీ దూదేకుల ఖాసీం సైదా స్వాగతించారు. అధినేత నిర్ణయమే మాకు శిరోధార్యం అని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను, ప్రజలందరూ అర్ధం చేయనుకోవాలని, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు కావచ్చు, ఎంతో ప్రజాదారణ కలిగిన ప్రజా నాయకులు పవన్ కళ్యాణ్ ని వైజాగ్ లో అడ్డుకున్న సందర్భం కావచ్చు, మొన్న విజయవాడ వస్తున్నప్పుడు జగ్గయ్యపేట దగ్గర పోలీస్ వ్యవస్థను ఉపయోగించి అడ్డుకోవాలనే ప్రయత్నం కానివచ్చు ఇవ్వన్నీ చూస్తా ఉంటే ప్రతిపక్ష పార్టీల అధ్యక్షులనే ఇలా అధికారం ఉపయోగించి ఇబ్బందులు గురించేస్తా ఉంటే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో ప్రజలు అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. వైసిపీపై యుద్దానికి సిద్దంగా ఉండాలని, జనసేన టిడిపి పంతం, వైసిపీ అంతం అనే నినాదంతో ముందుకు వెళ్తామని తెలియజేసారు. జనసేన, టీడీపీ కలయికను బీజేపీ కూడ స్వాగతించి కలసి రావాలని ఆకాంక్షించారు.