పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనుశ్రీ సత్యనారాయణ

రాజమండ్రి సిటి, అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక డీలక్స్ సెంటర్లో ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజమహేంద్రవరం జనసేన పార్టీ ఇంచార్జ్ అనుశ్రీ సత్యనారాయణ పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనుశ్రీతో పాటు నివాళులర్పించిన వారిలో తూర్పు గోదావరి జిల్లా సంయుక్త కార్యదర్శి గెడ్డం నాగరాజు , ప్రధాన కార్యదర్శులు వెంకట పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు, కార్యదర్శులు గుణ్ణం శ్యాంసుందర్, అల్లాటి రాజు, విన్న వాసు, జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపునీడి సూర్య మరియు విక్టరీ వాసు, నర్సపూడి రాంబాబు, తూట్ట హేమ దుర్గా, జెల్ల సతీష్ పాల్గొనడం జరిగింది.