ఏపీ నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర 59వ రోజు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం 59వ రోజు

శ్రీకాళహస్తి నియోజకవర్గం: ఏర్పేడు మండలం, మేర్లపాక పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. ఫ్యాక్టరీల కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నామని, డ్రైనేజ్ కాలువలు లేవు, స్ట్రీట్ లైట్లు లేవు తదితర సమస్యలు తెలిపారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల అధ్యక్షులు కిరణ్ కుమార్, నాయకులు నితీష్ కుమార్, వంశీ, వెంకట రమణ యాదవ్, సురేంద్ర, క్రాంతి, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, తోట గణేష్, జ్యోతి రామ్, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, శారద, పేట చిరంజీవి, హేమంత్ గౌడ్, రాజేష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.