ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ – జనసేన విజయ యాత్ర – 39వ రోజు

  • 39వ రోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఇంటింటికీ ప్రచారం

శ్రీకాళహస్తి నియోజకవర్గం: తొట్టంబేడు మండలం, బోనుపల్లి పంచాయతీలో ఇంటింటికీ ప్రచార కార్యక్రమం నిర్వహించిన నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా. కార్యక్రమంలో భాగంగా పంచాయతీలో ప్రచారం నిర్వహించి ఉమ్మడి మినీ మానిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవశ్యకతను వివరించడం జరిగింది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మదుసుధన్ రెడ్డి చేస్తున్న అవినీతి, అక్రమాలను, దోపిడీలను వివరించడం జరిగింది. రానున్న ఎన్నికల్లో జనసేన – టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంను ఆశీర్వదించాలని, తద్వారా రాష్ట్ర అభివృద్దికి సహకరించాలని కోరడం జరిగింది. గ్రామంలో ఒక్క స్ట్రీట్ లైట్లు కూడా ఈ 5 సం. ల్లో వేయలేదని, డ్రైనేజ్ కాలువలు లేవని, ఎలాంటి అభివృద్ది జరగలేదని, చదువుకున్న యువత ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో తొట్టంబేడు మండల అధ్యక్షులు పేట చంద్ర శేఖర్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, తోట గణేష్, రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, నాయకులు శారద, లక్ష్మి, రాజ్య లక్ష్మి, కవిత, హేమంత్ గౌడ్, గురవయ్య, చిన్న మునయ్య, రాజేష్, సురేష్, జనసైనికులు, దినేష్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.