నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన దాసరి రాజు

ఇచ్చాపురం, జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబుని ఇచ్చాపురం నియోజకవర్గ జనసేనపార్టీ సమన్వయకర్త దాసరి రాజు మరియు ఇచ్చాపురం నియోజకవర్గ జనసేనపార్టీ ఐటీ కో-ఆర్డినేటర్ కాళ్ళ దాలయ్య మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష పదవి నియామకం కోసం వివరించడం జరిగింది. అదేవిధంగా జిల్లాలో జరుగుతున్న సమన్వయ సమావేశాల్లో మరియు ఇచ్చాపురంలో జనసేనపార్టీ-తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాచరణ మరియు సమన్వయంతో ఎలా ముందుకు వెళ్ళాలి అని నాగబాబుతో సంప్రదించడం జరిగింది. అలాగే ఇచ్చాపురంలో జరిగే ప్రజా సమస్యలపై, జనసేనపార్టీ ఇచ్చాపురం నియోజకవర్గంలో పటిష్టత, రాజకీయ పరిణామాల కోసం చర్చించి పూర్తిగా వివరించడం జరిగింది. అదేవిధంగా నాగబాబుని ఒకసారి నియోజకవర్గం పర్యటించమని ఆహ్వానించడం జరిగింది. వీటి అన్నింటికీ సానుకూలంగా స్పందించి అధినాయకుని దృష్టికి తీసుకుని వెళ్లి రానున్న కాలంలో అన్నీ మంచే జరుగుతాయని, ఏ ఒక్క జనసైనికుడు కూడా నిరాశ చెందవద్దని, అలాంటి పరిస్థితి రాదని హామీ ఇవ్వడం జరిగింది. మన ప్రభుత్వంతోనే అందరూ కలిసి చేదోడు వాదోడుగా వెళ్లాలని చెప్పడం జరిగింది.