నారా గిరీష్ ని కలిసిన ఏపీ శివయ్య

ఐరాల మండలం, ఆదివారం నారా గిరీష్ ని చిత్తూరు ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఏపీ శివయ్య మర్యాదపూర్వకంగా కలిసారు. పూతలపట్టు నియోజకవర్గానికి విచ్చేసిన నారా గిరీష్ ని కలిసి నియోజకవర్గ ఉమ్మడి టిడిపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కలికిరి మురళీమోహన్ విజయంపై పలు విషయాలు చర్చించారు. 14 నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకోవాలని నారా గిరీష్ కోరారు. చిత్తూరు ఉమ్మడి జిల్లా ఏపీ శివయ్య మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, చిరంజీవి మెగా అభిమానులు, అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై అన్ని నియోజకవర్గాలు గెలిపించేదానికి సాయి శక్తులు కృషి చేస్తున్నామని ఏపీ శివయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌదరి, మధుసూదన్ రావు, కాకర్ల హేమాద్రి నాయుడు, గ్రామ కమిటీ అధ్యక్షుడు సతీష్, విక్రమ్, గణపతి నాయుడు, బాలాజీ నాయుడు, మండల అధ్యక్షుడు కే పురుషోత్తం ప్రధాన కార్యదర్శిలు వాసు రాయల్, తులసి బాబు, మండల ఉపాధ్యక్షుడు నవీన్, మండల కార్యదర్శి రెడ్డప్ప, మాజీ వార్డు సభ్యులు జి. చంద్రమౌళి, చెల్లె శివ, చెల్లె హరిప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.