జనసేన ఆధ్వర్యంలో మన్యం బందుకు పిలుపు

విశాఖ, జనవరి 6వ తేదీన మన్యం బందుకు ఆదివాసీ జనసేన రాష్ట్ర కమిటీ సభ్యుడు సాయిబాబా, దురియా, జిల్లా కార్యవర్గ సభ్యుడు సన్యాసిరావు, గేమ్మిలి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు బుధవారం సమావేశమై ఆరో తారీఖున జరుగు బంధు గురించి చర్చించడం జరిగినది. అనంతరం ఈ సందర్భంగా సాయిబాబా సన్యాసిరావు మాట్లాడుతూ గిరిజన భాష విద్యా వాలంటీర్లను రెన్యువల్ చేయాలని, జీవో నెంబర్ 3 చట్టబద్ధత కల్పించాలని, ఒకటి బై 70 చట్టం పటిష్టంగా అమలు చేయాలని తదితర డిమాండ్లపై జనవరి 6వ తేదీన గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగు బంధును జయప్రదం చేయాలంటూ, ఈ బందుకు ఆదివాసీ జనసేన నాయకులు పాల్గోవాలని, విశాఖ మన్యం ప్రాంతపు గిరిజనులు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని. ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొండ తదితరులు పాల్గొన్నారు