నాదెండ్ల మనోహర్ అరెస్టును ఖండించిన ఏపీ శివయ్య

చిత్తూరు జిల్లా, మాజీ స్పీకర్ మరియు ప్రస్తుత జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అరెస్టును ఖండించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య. వైజాగ్ లో టైకూన్ జంక్షన్ మూసివేయడంపై పీఏసీ చైర్మన్ గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని విమర్శించారు. ఈ రాష్ట్రంలో ప్రజల తరఫున సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళుతూ మరియు శాంతియుతంగా ఆందోళన చేస్తున్న మా ప్రియతమ నాయకుడైన నాదెండ్ల మనోహర్ ని అరెస్టు చేయడం చూస్తే ప్రజాస్వామ్య విలువలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని విమర్శించారు. అదేవిధంగా ప్రతిపక్షాల గొంతును నొక్కాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. 2024 సంవత్సరంలో జనసేన పార్టీ మరియు మిత్రపక్షాల కలయికతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తద్యమని పేర్కొన్నారు.