సేవా తత్పరత కలిగిన పార్టీ జనసేన: డా.యుగంధర్ పొన్న

  • డా.యుగంధర్ పొన్న చేతులమీదుగా నిత్యవసర సరుకులు పంపిణి

గంగాధర నెల్లూరు: తుఫాను కారణంగా పునరావాసం కొల్పోయిన మణిపురం వాసులకు సోమవారం జనసేన ఇంచార్జ్ డా.యుగంధర్ పొన్న చేతులమీదుగా నిత్యవసర సరుకులు పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సిద్ధాంతాలకు కట్టుబడిన పార్టీ జనసేన అని, కష్టాలు ఎక్కడుంటే అక్కడ జనసేన ఉంటుందని.. పునరావాసం కల్పించిన అధికారులకు, ప్రతినిధులకు అభినందనలు తెలియజేసి.. వారి ఇళ్ల నిర్మాణానికి అధికారులు సహకరించాలని ఈ సందర్బంగా కోరి.. మా వంతు తోడ్పాటుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని.. పాలసముద్రం మండల ప్రజలకు జనసేన అండగా ఉంటుందని యుగంధర్ పొన్న తెలియజేసారు.