విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన అప్పనపల్లి జనసేన నాయకులు

జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రోడ్ల సమస్య మీద పోరాటంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజవర్గంలో మామిడికుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో శ్రమదాన కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకుల ఆధ్వర్యంలో రోడ్లకు మరమ్మత్తులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మద్ద చంటిబాబు(జిల్లా సంయుక్త కార్యదర్శి), అడబాల తతకాపు (మామిడికుదురు మండలం అధ్యక్షుడు), కంకిపాటి నరసింహారావు, జాలెం శ్రీనివాస రాజా, పోతు కాశీ, మట్టా సత్తిబాబు, చెరుకూరి సత్తిబాబు, కొమ్ములు జంగమయ్య( పెద్దపట్నం లంక ఎంపీటీసీ), బొంతు గాంధి(మండల పార్టీ ఉపాద్యక్షుడు), బల్ల సతీష్ కుమార్, నంబు అచ్చిబాబు, శిరిగినీడి సురేష్, కుంపట్ల రమేష్, జనసేన నాయకులు, మరియు జనసైనికులు పాల్గొన్నారు.