బొబ్బిలి జనసేన కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన పార్టీ ఆఫీసులో బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి, జనసేన సీనియర్ నాయకులు టౌన్ వైట్ మెగా ఫ్యామిలీ ప్రెసిడెంట్ లంక రమేష్, జనసేన వీరమహిళ బంటుపల్లి దివ్య, జనసేన నాయకులు జమ్ము గణేష్, ఉల్లి సంతోష్, గండేటి శ్రీను, చంద్రమౌళి ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బొబ్బిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ గిరడ అప్పలస్వామి గారు చేతుల మీదుగా జాతీయ పతాకం ఎగరవేయడం జరిగింది. ఈ వేడుకల్లో జనసేన వీరమహిళ రామ లక్ష్మి, జనసేన నాయకులు పేకెటి సురేష్, లెంక శంకర్రావు, గొల్లపల్లి జాన్, అక్కివరపు ప్రసాద్, భార్గవ్, సతీష్, నరేంద్ర, వంశీ, పి శంకర్, హేమంత్, మహేష్, సాయి, రవి, పవన్ తేజ, బొబ్బిలి నియోజకవర్గం జనసేన నాయకులు జనసైనికులు, వీరమహిళలు బాలబాలికలు తదితరులు పాల్గొన్నారు.