పోస్టల్‌ బ్యాలెట్‌ దరఖాస్తుకు త్వరపడండి

కరోనా నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం కల్పించారు. 80 ఏళ్లు దాటిన ఓటర్లు, దివ్యాంగులు, నవంబర్‌ 1 తర్వాత కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం www.tsec.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల అధికారి డీఎస్‌ లోకే్‌షకుమార్‌ సూచించారు. పోస్టల్‌ బ్యాలెట్లను వారి చిరునామాలకు పంపిస్తామని చెప్పారు.