సిటీ కాలేజ్ జనసేన విద్యార్థి విభాగ కమిటీ నియామకం

హైదరాబాద్, జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ ఆదేశాలతో హైదరాబాద్ జనసేన విద్యార్ధి విభాగ అధ్యక్షులు మహేష్ పెంటల సిటీ కాలేజ్ జనసేన విద్యార్థి విభాగ కమిటీని ప్రకటించడం జరిగింది. జనసేన విద్యార్థి విభాగం బలోపేతంలో భాగంగా శుక్రవారం సిటీ కళాశాల సందర్శించి నూతన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ విద్యార్థుల సమస్యల గురించి ప్రతీ క్లాసుకి వెళ్లి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జాయిన్ జనసేన విద్యార్థి విభాగం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. విద్యార్థులు ఉత్సాహంగా జనసేన విద్యార్థి విభాగంలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల జనసేన విద్యార్థి విభాగం కమిటీని ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన విద్యార్థి విభాగం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మహేష్ పెంటల, ఓయూ ప్రెసిడెంట్ వినోద్ నాయక్, విద్యార్థి నాయకులు వెంకటేష్, ధనుష్ ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.