జనసేన మండల లీగల్‌సెల్‌ అద్యక్షుల నియామకం

*కొయ్యలగుడెం రోటరీ ఫంక్షన్‌హాల్ లో మండల లీగల్‌సెల్‌ అద్యక్షుల నియామకం

ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా, పోలవరం, చింతలపూడి నియోజకవర్గాలలో కొన్ని మండలాలకి జనసేన లీగల్‌సెల్‌ మండల అద్యక్షులుగా భాద్యతలు ఇ. సాంబశివ ప్రతాప్ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ చేతుల మీదుగా ఏ.వి.వి భువనేశ్వరిని కొయ్యలగూడెం, పోలవరం మండలాలకు.. మేకల రామ్మోహనరావు ను కుక్కునూరు, జంగారెడ్డిగూడెం మండలాల లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా.. తమా రఘురాం ను బుట్టయి గూడెం, జీలుగుమిల్లి మండల లీగల్ సెల్ ప్రెసిడెంట్‌ గా.. కె.నరసింహ ను వేలేరుపాడు మండల లీగల్ సెల్ ప్రెసిడెంట్ గా.. డి కే వీ ప్రసాద్ బాబు లక్కావరం ఏరియా ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. వారందరికీ నియామక పత్రాలను లీగల్‌సెల్‌ స్టేట్‌ చైర్మన్‌ ప్రతాప్‌ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు, రామచంద్రరావు స్టేట్ లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు, సెక్రటరీ నిమ్మల జ్యోతి కుమార్, పశ్చిమగోదావరివారి జిల్లా లీగల్ సెల్ చైర్మన్ మేకల రామ్మోహన్‌రావు, జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌మరియు లీగల్‌ సెల్‌ నాయకులు కరాటంసాయి, పశ్చిమగోదావరిజిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమణుగు రవి, జిల్లా కార్యదర్శి పాదం కృష్ణ, జిల్లా సంయుక్త కార్యదర్శి మండలాద్యక్షులు అడపా నాగరాజు, తెల్లం రవిప్రసాద్, గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ, తోట రవి మాదేపల్లి శ్రీనివాస్, పాదం అనీల్‌, చవ్వా రాము, సూర్య, మామిడిపల్లి ప్రసాద్‌ పాల్గొన్నారు.