కాకినాడ రూరల్ కరప మండల కమిటీ కార్యవర్గ కమిటీ నియామకం

కాకినాడ, జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మండల కమిటీ అధ్యక్షులను నియమించడం జరిగింది.అందులో భాగంగానే కాకినాడ రూరల్ కరప మండల కమిటీ కార్యవర్గ కమిటీని రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆధ్వర్యంలో మండల కమిటీని నియమించుకోవడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు ఉదయం మండల కేంద్రమైన కరప లో జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండలరావు, కరప మండల అధ్యక్షులు బండారు మురళి, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ భోగిరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భోగిరెడ్డి కొండల రావు చేతులమీదుగా 33 మందితో గల మండల కార్యవర్గ సీల్డ్ కవర్ ను తెరచి పత్రికా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో బండారు మురళి, భోగి రెడ్డి కొండలరావు మాట్లాడుతూ మండల కార్యవర్గం ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు అలుపెరుగని పోరాటం చేస్తూ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేస్తూ ప్రజల మధ్యకు జనసేన సిద్ధాంతాలను జనసేన ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి రానున్న కాలంలో జనసేన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే విధంగా కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, ముద్రగడ రమేష్, జిలేల్లా ప్రసాద్, సనా శ్రీను, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.