జనసేన పార్టీ ఫ్లెక్స్ చింపిన వారిపై చర్యలు తీసుకోవాలి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం టౌన్ లో పాత గయ శ్రీ కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్ లో నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది.. అయితే 24-1- 2022 రోజు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వాటిని ధ్వంసం చేశారు. మా అధినేత పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ ఫ్లెక్స్ ధ్వంసం చేసిన దుండగులను వెతికి పట్టుకోవాలి అని చట్టపరమైన వారి మీద చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు తో కలిసి పిఠాపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎ.ఎస్.ఐ కి కంప్లైంట్ పత్రము అందజేశారు. ఈ సందర్భంగా మొగిలి అప్పారావు మాట్లాడుతూ.. బైపాస్ రోడ్ లో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ ఫ్లెక్స్ ధ్వంసం చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎ.ఎస్.ఐ తో చెప్పటం జరిగిందని, వారు స్పందించి వెంటనే వీరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు జనసైనికులు జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, గొల్లప్రోలు మండల అధ్యక్షులు అమరది వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, గోపు సురేష్, మేళం బాబి, యండ్రపు శ్రీనివాస్, సి.హెచ్ నవీన్, సి.హెచ్ శిరీష, తదితరులు పాల్గొన్నారు.