కుప్పం మండల కమిటీల నియామకం

కుప్పం, అధ్యక్షుల వారి అనుమతితో ఇదివరకే నియోకవర్గంలోని మండలాధ్యక్షులను ప్రకటించిన విషయం తెలిసినదే. అందులో బాగంగా, అధిష్టానం వారి ఆదేశాలు మరియు జిల్లాధ్యక్షుల వారి సూచనల మేరకు, కొత్తగా మండల కమిటీ సభ్యులను, నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు సమన్వయకర్తలు, మండల అధ్యక్షులు వారి సమక్షంలో ఎన్నుకోవడం మరియు వారి యొక్క భాధ్యతలు గురించి తెలియజేయడం కొరకు ఆదివారం అనగా 09/01/2022 మండల కమిటీ సమావేశం ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ డాక్టర్ ముద్దినేని వెంకటరమణ, జిల్లా కార్యదర్శి శ్రీ రామమూర్తి, సంయుక్త కార్యదర్శి శ్రీ మునెప్ప, శ్రీ వేణు, చిరంజీవి యువత అధ్యక్షులు శ్రీ నవీన్, మండల అధ్యక్షులు శ్రీ కిషోర్, శ్రీ హరీశ్, శ్రీ సుధాకర్, శ్రీ ప్రవీణ్, శ్రీ చంద్రు, శ్రీ అమీర్ మరియు ఇతర జనసైనికులు పాల్గొని నూతన మండల కమిటీ కార్యవర్గం ఏర్పాటు గురించి చర్చించడం జరిగింది. అందరితో చర్చించిన పిమ్మట నూతన మండల కమిటీ జాబితా వివరాలను జిల్లాధ్యక్షుల వారికి అందజేయడం జరుగుతుందని నియోజకవర్గ ఇన్చార్జి తెలియజేయడం జరిగింది.