కాపునాడు మండల అధ్యక్షులుగా మద్దింశెట్టి సురేష్ నియామకం
డా అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఉప్పలగుప్తం మండల కాపునాడు మండల అధ్యక్షునిగా మద్దింశెట్టి సురేష్(సుబ్బరాజు)ను నియమించారు. ఈ మేరకు కాపునాడు వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బిరెడ్డి సురేష్ ద్వారా ఉత్తర్వులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కాపుల అభ్యున్నతి, సంక్షేమం కొరకు దివంగత వంగవీటి మోహన రంగా, పిళ్ళా వేంకటేశ్వర రావు వంటి పోరాట యోధుల స్పూర్తితో నిర్విరామంగా కృషి చేస్తానన్నారు. తన ఎంపికకు కృషి చేసిన కాపునాడు ఉపాధ్యక్షులు గంగుమళ్ళ శ్రీనివాస్, నిమ్మకాయల జగ్గయ్య నాయుడు, అరిగెల నానాజీ, పోలిశెట్టి భాస్కరరావు, నల్లా శ్రీధర్, లింగోలు పండు, ఆకుల సూర్య నారాయణమూర్తి, ఆకుల బుజ్జి, సలాది నాగరాజు, చిక్కం పెదబాబు, గొలకోటి సత్తిరాజు తదితర పెద్దలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జనసేన కుటుంబ సభ్యులు సురేష్ కి ప్రత్యేక ధన్యవాదములు శుభాకాంక్షలు.