అరకు నియోజకవర్గం జనసేన ముఖ్యనాయకుల సమావేశం

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గంలో గురువారం జనసేన పార్టీ ముఖ్యనాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అరకు పార్లమెంట్ ఇంచార్జి డా. వంపురు గంగులయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తూ.. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ.. అరకు నియోజకవర్గానికి సంబంధించి ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. పార్టీ భలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని, నియోజకవర్గంలో సమన్వయ కమిటీ సభ్యులను ఏర్పాటు చేసి ఈ రోజు (గురువారం) అధిష్టానికి తెలియ పరుస్తామని తెలిపారు. సమన్వయ కమిటీ సభ్యులు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ పార్టీ సిద్ధాంతాలు ప్రజల దగ్గర కి తీసుకెళ్లి గ్రామస్థాయిలో పార్టీని కార్యకర్తలను సమన్వయం చేస్తూ 2024 లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది. 6 మండలాలకు గాను 13 మంది తో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని పార్టీ భలోపేతం చేయడానికి సమన్వయకమిటీ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తారని తెలిపారు. ముఖ్యనాయకుల సమావేశంలో అరకు నియోజకవర్గం నాయకులు మాదాల శ్రీరాములు, కొనెడి లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, దూరియ సాయి బాబా, బంగరు రామదాసు, కృష్ణ, అల్లంగి రామకృష్ణ పాల్గొన్నారు.