నాణ్యతలేని రోడ్లకు కారణం అధికారులా?.. కాంట్రాక్టర్లా?

అరకు నియోజకవర్గం: పెదబయలు మండలంలో శిరీష పల్లి నుండి బీట్ రోడ్డు తోటల గొంది గ్రామము వరకూ నాణ్యతా లోపం కారణంగా కనీసం సంవత్సరం కాకుండా పూర్తిగా పాడైపోయింది. ఈ సమస్యపై స్పందించిన పెదబయలు మండల జనసేన అధ్యక్షులు జాగరపు పవన్ మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ రోడ్డుపై నిత్యం ప్రయాణం సాగిస్తున్న వాహనదారులు ఇబ్బంది పడుతూ, అప్పుడప్పుడు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ రోడ్డు వలన ప్రజలకు ఏమి ప్రయోజనం, కష్టాలు దుఃఖాలు తప్ప, మీ గ్రామానికి రోడ్లు వేశాం అభివృద్ధి జరిగింది అని చెప్పుకునే నాయకులు ఒకసారి ఈ నాణ్యత లేని రోడ్డు దుస్థితి చూడండి. నాణ్యత లేని రోడ్లు వేయటం వలన అభివృద్ధి ఎక్కడ జరిగింది. నాణ్యతలేని రోడ్లకు కారణం అధికారులా?.. లేక కాంట్రాక్టర్లా? అని పవన్ ప్రశ్నించారు. సంబదిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున పవన్ డిమాండ్ చేసారు.