అధికార పార్టీ చర్యలను తీవ్రంగా ఖండించి తిరుపతి జనసేన

  • బలవంతంగా జనసేన నాయకులు రాజారెడ్డి మరియు ముఖ్య నాయకుల అరెస్టు

తిరుపతి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వైఎస్ఆర్సిపి పార్టీ వారు తిరుపతిలో యూనివర్సిటీ వద్ద దగ్ధం చేయడం జరిగింది. ఆ సంఘటనను నిరసిస్తూ జనసేన పార్టీ అన్నమయ్య సర్కిల్ వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సిపి పార్టీ డౌన్డౌన్ అంటూ జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయుటకు ప్రయత్నించగా పోలీసులు జనసేన తిరుపతి పట్టణ అధ్యక్షులు రాజారెడ్డి ఉపాధ్యక్షులు బాబ్జి, మరియు మునస్వామి, హేమంత్, కిషోర్, సుమన్, ఈశ్వర రాయల్, పురుషోత్తం, వీర మహిళలు జిల్లా నాయకులు వనజ, కీర్తన, లక్ష్మి, విజయా రెడ్డి, నవ్యా రెడ్డి, బాలాజీ, యశ్వంత్, దిలీప్ లను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజారెడ్డి మరియు నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలకు చెక్ పెట్టే రోజు దగ్గరలోనే ఉందని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పాలని వైసీపీలో ఉన్నవారు పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా దూషించిన వారిని మాత్రమే ఆయన మాట్లాడారని, మీ ఆగడాలు ఇక సాగవని మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జోలికి జనసేన పార్టీ నాయకుల జోలికి వస్తే చూస్తూ సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.