ఆధారం లేని కుటుంబానికి అండగా డాక్టర్ శ్రీధర్ పిల్లా

  • వైద్య ఖర్చుల నిమిత్తం 5,000/- ఆర్ధికసాయం

పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా చిత్రాడ గ్రామానికి చెందినటువంటి దూలపల్లి రాజులమ్మ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో మంచానికే పరిమితమై కన్నబిడ్డలు కూడా లేక ఏ ఆధారం లేనటువంటి దూలపల్లి రాజులమ్మ దూలపల్లి అప్పారావు దంపతులను చిత్రాడ ఎంపీటీసీ నాగబాబు సమక్షంలో డాక్టర్ శ్రీధర్ పిల్లా పరామర్శించడం జరిగింది. అనంతరం వైద్య ఖర్చుల నిమిత్తం ఐదువేల రూపాయలను తనకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్రాడ జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.