జనసేనాని జన్మదిన వేడుకలలో భాగంగా జనసైనికుని కుటుంబానికి ఆర్థిక చేయూత

మదనపల్లెలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మంజునాథ్ స్వామి ఆలయంలో పవన్ కళ్యాన్ గారి పేరు మీద జనకల గోత్రం మీద అర్చన మరియు పూజలు చేయించిన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి మరియు ఇదివరలో బస్సులో గుండెపోటుతో మరణించిన కుర్మిశెట్టి ప్రభకర అనే జనసైనికుని భార్య కె స్వాతి కుటుంబానికి ఆర్థిక చేయూతగా గంగారపు రామదాసు చౌదరి 20 వేల రూపాయలు ఇచ్చారు.. మరియు మదనపల్లె జనసైనికులు 13 వేల రూపాయలు ఈవ్వడము జరిగింది. మొత్తం 33 వేల రూపాయల ఇవ్వడము జరిగింది. మరియు వారి పిల్లలు స్వరూప 9 సం.. గిరీష్ 11 సం వీరిని పై చదువుల కై రామదాసుచౌదరి బాధ్యత తీసుకొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా కార్యదర్శి సనఉల్లా.. మదనపల్లె మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, నిమ్మన పల్లె మండల అధ్యక్షుడు ప్రదీప్ సింగ్, రామసముధ్రం మండల అధ్యక్షులు చంద్రశేఖర్, సీనియర్ నాయకుడు తోట కళ్యాణ్, ఐటీ విభాగం రాజేష్, జగదీశ్, లక్షినారాయన, చంద్ర, ప్రధాన కార్యదర్శి లోకేష్, రెద్దమ్మ, టైగర్ పద్దు, కోలానగవేని శేఖర్, దామోదర్ మధు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *