ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా స్పందించిన సర్వేపల్లి జనసేన

సర్వేపల్లి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఘాటుగా స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మీ అధ్యక్షుడు దగ్గరకు వెళ్లి రాజీనామా చేసి ఎన్నికల్లో నిలబడు అంతేగాని ఇంకొక సారి పవన్ కళ్యాణ్ గారి పైన గానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల పైన గాని అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు ప్రజల చేత ఓట్లు వేయించుకొని గెలిచి ప్రజా నాయకులు అని చెప్పుకుంటూ అ దేవాలయం లాంటి అసెంబ్లీలలో అదేవిధంగా భారీ బహిరంగ సభల్లో మహిళలకు పక్కన పెట్టుకొని ముఖ్యంగా గౌరవ ఎంపీలను పక్కన పెట్టుకొని బూతులు మాట్లాడే సంస్కృతి అది భారతీయ సంస్కృతి కాదు ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పవన్ కళ్యాణ్ పైన కాకుండా కాకినాడలో ఉండే ప్రజా సమస్యల పైన రోడ్లు మరియు నీరు వాటి మీద దృష్టి పెట్టాలని సురేష్ బాబు ఘాటుగా జవాబు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, రవికుమార్, సందీప్, అవినాష్, శ్రీహరి పాల్గొన్నారు.