ఆశా వర్కర్లను, నాయకులను వెంటనే విడుదల చేయాలి

పెడన, రాజ్యాంగబద్ధంగా తమ హక్కులను సాధించేందుకు శాంతియుత నిరసన చేపట్టిన ఆశా వర్కర్లను, ఉద్యోగ సంఘ నాయకులను, ఈ వైసీపీ ప్రభుత్వం పోలీసు బలంతో అడ్డుకోవడం హేయమైన చర్య. రాష్ట్రంలో పోలీసు పాలన జరుగుతుంది. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలన సాగుతోంది. పెడన పోలీస్ స్టేషన్ లో అరెస్టు చేసిన ఆశా వర్కర్లను, ఉద్యోగ సంఘ నాయకులను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుందని పెడన నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు సమ్మెట అన్నారు.