జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో గాయపడ్డ మహిళకు ఆర్థిక సాయం

శతఘ్ని న్యూస్: మార్చి 14వ తేదీన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని జనసేన పార్టీ తరపున13వ వార్డు కౌన్సిలర్ గా పోటీ చేసిన వీరమహిళ శ్రీదేవి ప్రమాదవశాత్తూ గాయపడడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ ఫోన్ ద్వారా పరామర్శించి యోగ క్షేమాలు తెలుసుకొని 10,000 రూ ఆర్థికసాయం అందించారు. జిల్లా అధ్యక్షులు టీసీవరుణ్ తరపున జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య 10,000 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధనకార్యదర్శి పత్తి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శిలు సిద్దు, శివ, నాయకులు వెంకట్ నారాయణ, పవనిజం రాజు, వీరమహిళలు చంద్రకళ, రూప మారిశెట్టి, గీత, నాయకులు లోకేష్, విష్ణు, శివ శంకర్, రమేష్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.