జనసైనికునికి మనోధైర్యాన్నిచ్చిన నిడదవోలు జనసేన

పశ్చిమగోదావరి జిల్లా, నిడదవోలు నియోజకవర్గంలోని రూరల్ మండలంలో విజ్జేశ్వరం గ్రామానికి చెందిన జనసైనికుడు కప్పుల లక్ష్మీ శివనారాయణకి గత నెలలో కొవ్వూరు వద్ద ఆక్సిడెంట్ జరిగి రెండు భుజాలకు ఆపరేషన్ చేయడం జరిగింది. వీరిని కార్యవర్గం మరియు మండల అధ్యక్షులు కలిసి పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తులా చినబాబు, సంయుక్త కార్యదర్శి ఉలుసు సౌజన్య, సంయుక్త కార్యదర్శి పాలా వీరాస్వామి మరియు నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం కలిసి అతని కుటుంబానికి బియ్యం కూరగాయలు మరియు నిత్యావసర వస్తువులు అందచేసి భవిష్యత్తులో కూడా జనసేన తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విజ్జేశ్వరం జనసైనికులు సూరిశెట్టి శేషగిరి, వరప్రసాద్, రాజేష్, వీరబాబు, రవి, ప్రసాద్, మణికంఠ, బ్రహ్మాజి పాల్గొన్నారు.