కడప బస్సు ప్రమాద క్షత్రగాత్రులను పరామర్శించిన అతికారి దినేష్

  • జనసైనికుడు ఏనుగుల మల్లి మరియు బస్సు కండక్టర్ బాల వెంకటేష్ కుటుంబాలకు రూపాయలు 20,000/- ఆర్ధికసాయం

రాజంపేట, తిరుపతి కడప హైవేలో శనివారం జరిగిన బస్సు ప్రమాద బాధిత క్షత్రగాత్రులను రాజంపేట జనసేన పార్టీ నాయకులు అతికారి దినేష్ పరామర్శించి పండ్లు, బ్రెడ్ ప్యాకెట్లు, పౌష్టికాహారం, కిట్లను అందజేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన రాజంపేట నియోజకవర్గ జనసైనికుడు ఏనుగుల మల్లి తండ్రి ఏనుగుల శంకరయ్య తీవ్రంగా గాయపడడంతో అతని కుటుంబ సభ్యులకు 10,000/- రూపాయల ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే సిద్దవటం మండలానికి చెందిన బస్సు కండక్టర్ బాల వెంకటేష్ కూడా తీవ్రంగా గాయపడి ఐసియులో ఉండడంతో అతని కుటుంబ సభ్యులకి కూడా 10,000/- రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కడప జిల్లా కాపునాడు అధ్యక్షులు సింగనమల శ్రీనివాసులు, హేమంత్, అండ్రు తదితరులు పాల్గొన్నారు.