పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘననివాళి

అక్టోబరు 2, జాతిపిత మహత్మగాందీ జయంతి మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలు సందర్భంగా రామచంద్రపురం పట్టణం శ్రీ క్రుత్తి వెంటి పేర్రాజు పంతులు గారి జూనియర్ కళాశాల లో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి, మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వాతంత్య్రం సాధించిన నాయకులలో అగ్రగణ్యుడని శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆమహనీయుడుకు ఘన నివాళులు అర్పించడం జరిగింది.

ఈ వేడుకలలో పట్టణ అధ్యక్షులు గొల్లపల్లి క్రిష్ణ, పట్టణ యూత్ అధ్యక్షులు మిధిల్ కుమార్ జైన్, జిల్లా కార్యదర్శి బుంగరాజు,3 వ వార్డు కౌన్సిలర్ అంకం శ్రీనివాస్, ఎంపీటీసీ సాక్షి శివ క్రిష్ణ కుమార్, జనసేన నాయకులు కె. సాయి కుమార్, నంబుల నాగు, లంకా సత్యనారాయణ, పోలిశెట్టి పెదబాబు, రాంబాబు నాయుడు నంబుల శివ, పడాల లోవ రాజు, కొలగాని సతీష్, కుంపట్ల పవన్ కుమార్, ఖండవిల్లి సుబ్రహ్మణ్యం, మద్దాప్రసాద్, తదితర పట్టణ జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది.