ఆత్మకూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూరు, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల శ్రేయస్సు కోరుతూ 500/- రూపాయలకే 5,00,000/-లక్షల ప్రమాద భీమా ప్రమాదవశాత్తు వైద్యశాలలో చేరితే 50,000/-రూపాయల వరకు వచ్చేటట్టు క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆత్మకూరు పార్టీ కార్యాలయంలో ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఏ పార్టీ తమ కార్యకర్తల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదని కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి జనసేన కార్యకర్త ఉపయోగించుకోవాలని ముఖ్యంగా యువకులు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని కోరారు.