జనసేన సిద్ధాంతాల అవగాహనపై పాదయాత్ర

పిఠాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు, జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలలో అవగాహన పెంచడం కోసం పాదయాత్ర నిర్వహిస్తున్న విశ్రాంత ఉద్యోగి శ్రీ బుర్ర సూర్య ప్రకాష్ కి మద్దతుగా ఇంచార్జ్ శ్రీమతి శేషుకుమారి భర్త డాక్టర్ మాకినీడి వీరప్రసాద్ 2వ రోజు పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ప్రచారంలో పాల్గొన్నారు. డాక్టర్ వీరప్రసాద్ మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు గ్రౌండ్ లెవెల్ లోకి తీసుకువెళ్ళటం వలన పార్టీ చాలా బలపడుతుందని, ఈ కార్యక్రమంలో జన సైనికులు, నాయకులు, వీరమహిళలు ఆ పెద్దాయనకి తోడుగా ఉండి నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో కందరాడ జనసేన ఎంపీటీసీ పిల్లా సునీత (దినేష్) చీకోలు రాజశేఖర్, మైనా బత్తుల చిన్న, మేళం బాబి, యాండ్రపు శ్రీనివాస్, పెంటకోట కృష్ణ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.