రిపోర్టర్ పై దాడి చేయడం హేమమైన చర్య: రాటాల రామయ్య

రాజంపేట, సిద్దవటం, ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పై దాడి చేయడం హేయమైన చర్య అని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. సోమవారం మండలంలోని ఉప్పరపల్లె జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాప్తాడులో సిద్ధం సమావేశంలో ఫొటోలు తీస్తుండగా ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కృష్ణపై వైకాపా అల్లరిమూకలు దాడి చేశారన్నారు. జర్నలిస్టుపై దాడి చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.