కేటీఆర్ను కలిసిన అజారుద్దీన్..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సిఏ) అధ్యక్షుడు అహ్మద్అజారుద్దీన్ఉప్పల్ స్టేడియం లీజు పీరియడ్ను పెంచాలని, ఆస్తిపన్ను తగ్గించాలని కోరుతూ మున్సిపల్శాఖమంత్రి కేటీఆర్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్కు విజ్ఞప్తిచేశారు. ఈమేరకు గురువారం ఇరువురు మంత్రులను ఆయన కలిశారు. జిల్లా ,గ్రామీణ స్థాయిలో క్రికెట్ను అభివృద్ధి చేసేందుకు, గ్రామీణ క్రీడాకారులను వెలికి తీయడానికి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సాట్స్తో కలిసి పనిచేస్తోందని అజారుద్దీన్ తెలిపారు. హెచ్సిఏ చేసిన విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్తో చర్చిస్తామని అన్నారు.