కురుపాం ప్రజలకోసం కోర్టుకు వెళ్లిన బాబు పాలూరు

కురుపాం నియోజకవర్గం: కొమరాడ మండలం, దేవకోన ఇసుకరీచ్ అక్రమ తవ్వకాలు, ఇసుక అక్రమ రవాణాను జనసేన పార్టీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. దీనిని అడ్డుకున్న జనసేన పార్టీ నాయకులు బాబు పాలూరు, పెంట శంకర్ రావు, అల్లు రమేష్, సరబోను రమేష్ కుమార్, ఖాతా విశ్వేశ్వరరావు, తెంటు శ్రీకర్, నేరేడు బిల్లీ వంశీలపై స్థానిక వైసిపి నాయకులు అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. ఈ అక్రమ కేసులు నేపథ్యంలో జనసేన లీగల్ సెల్ స్టేట్ సెక్రటరీ కేతిరెడ్డి అశోక్ తో కలిసి బాబు పాలూరు తదితర జనసేన నాయకులు బుధవారం పార్వతీపురం కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగ బాబు పాలూరు మాట్లాడుతూ ఈ కేసును న్యాయ విభాగ (లీగల్ సెల్) స్టేట్ సెక్రటరీ కేతిరెడ్డి అశోక్ కోర్టులో వాదించడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైన కేసులకి జనసేన పార్టీ నాయకులు జన సైనికులు గాని ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా జనసేన పార్టీ ఎక్కడ అవినీతి జరిగితే ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ బలంగా పోరాడు నిలబడుతుందని తెలియజేసారు.